JEE Main: జేఈఈ మెయిన్.. మరో విద్యార్థికీ 300కి 300 మార్కులు
జేఈఈ మెయిన్ చివరి విడత పరీక్ష తుది కీని జాతీయ పరీక్షల సంస్థ(ఎన్టీఏ) సోమవారం రాత్రి విడుదల చేసిన విషయం తెలిసిందే.
నెల్లూరు: జేఈఈ మెయిన్ చివరి విడత పరీక్ష తుది కీని జాతీయ పరీక్షల సంస్థ(ఎన్టీఏ) సోమవారం రాత్రి విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రాథమిక కీని కొద్దిరోజుల క్రితం వెల్లడించిన ఎన్టీఏ.. దానిపై అభ్యంతరాలను స్వీకరించింది. ఈ క్రమంలో సోమవారం రాత్రి తుది కీని వెబ్సైట్లో ఉంచింది. ప్రాథమిక కీలో ఇచ్చిన జవాబుల్లో మొత్తం 24 ప్రశ్నలకు సమాధానాలను మార్చినట్లు నారాయణ విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ పి.ప్రమీల తెలిపారు. దేశవ్యాప్తంగా దాదాపు తొమ్మిది లక్షల మంది ఈ పరీక్షలు రాశారు. గత జనవరి, తాజా పరీక్షల్లో వచ్చిన స్కోర్లో ఉత్తమమైన దాన్ని ఎంచుకొని ర్యాంకులు ఇస్తారు.
నెల్లూరుకు చెందిన పి.లోహిత్ ఆదిత్యసాయి 300కి 300 మార్కులు సాధించాడు. ఆయన మొదటి 10 ర్యాంకుల్లో నిలిచే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. లోహిత్.. పాఠశాల విద్య నుంచి ఇంటర్ వరకు నెల్లూరులోని నారాయణ విద్యా సంస్థల్లో చదివాడు. జూన్ 4వ తేదీన జరిగే జేఈఈ అడ్వాన్స్డ్లో ఉత్తమ ర్యాంకు సాధించి ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ చదువుతానని లోహిత్ తెలిపాడు. లోహిత్ కుటుంబం నెల్లూరులోని లక్ష్మీపురంలో నివాసముంటోంది. తండ్రి శ్రీనివాసరావు సివిల్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. తల్లి వరలక్ష్మీ గృహిణి. హైదరాబాద్కు చెందిన సింగరాజు వెంకట్ కౌండిన్య 300కి 300 మార్కులు సాధించిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.